- ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ గణేశ్ శోభాయాత్ర
- 10.30 గంటలకు హుస్సేన్ సాగర్లో నిమజ్జనం
- 8 గంటలకు బాలాపూర్ లడ్డూ వేలం
- 11న ట్యాంక్ బండ్పై గంగా హారతి
- వివరాలు వెల్లడించిన ఉత్సవ సమితి
సిటీలో గణేశ్ శోభా యాత్ర, నిమజ్జనోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నిమజ్జనోత్సవానికి ముందు రోజు గంగా హారతి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 12న ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మహా గణపతి బయలు దేరతాడు. 10.30కి నిమజ్జనం ఉంటుంది. అదేరోజు ఉదయం 8 గంటలకు బాలాపూర్ గణపతి లడ్డూ వేలం ఉంటుంది. – హైదరాబాద్, వెలుగు
గణేశ్ నిమజ్జనోత్సవాలకు సర్వం సిద్ధం,గా ఉందని భాగ్యనగర్గణేష్ ఉత్సవ సమితి తెలిపింది. ఈ నెల 12న నిర్వహించే నిమజ్జనోత్సవ వివరాలను శుక్రవారం మీడియాకు తెలిపింది. భాగ్యనగర్గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంత్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్సవాలకు బల్దియా కమిషనర్ నోడల్ ఆఫీసర్గా ఉంటారన్నారు. మెట్రో, వాటర్ వర్క్స్, జీహెచ్ఎంసీ, పోలీసులు, ఆర్టీవో సిబ్బంది విధుల్లో పాల్గొంటారని తెలిపారు.
సెప్టెంబర్ 12న ఉదయం 6 గంటలకు ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమై 10.30కి నిమజ్జనం జరుగుతందన్నారు. తర్వాత 8గంటలకు బాలాపూర్లోని ప్రధాన గణపతి లడ్డూ వేలంతో శోభాయాత్ర స్టార్ట్ అవుతుందన్నారు. షాలిబండ, చార్మినార్ మీదుగా ఈ గణపతి టాంక్బండ్ చేరుకుంటాడన్నారు. టాంక్బండ్పై 11న గంగా హారతి కార్యక్రమం ఉంటుదన్నారు. నిమజ్జనోత్సవాలకు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, ప్రజ్ఞ మిషన్వ్యవస్థాపకుడు స్వామి ప్రజ్ఞానాజి హాజరవుతారన్నారు.సుమారు 30 నుంచి 40 లక్షల భక్తులు వస్తారని అంచానా వేస్తున్నట్టు తెలిపారు.
సిటీలో లక్షకు పైగా విగ్రహాలున్నాయని, 32 చెరువుల్లో నిమజ్జనాలకు ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. 8 నుంచి 10వ తేదీ దాకా భజన పోటీలు ఉంటాయన్నారు. 8న మీరాలం మండి, ఖైరతాబాద్, కార్వాన్, కాచిగూడ, బాలాపూర్ సర్కిళ్లలో.. ఫైనల్ పోటీలు 10న రవీంద్రభారతిలో నిర్వహిస్తామన్నారు. వివరాలకు 99080 06662, 040–24740044 నంబర్లను సంప్రదించాలని సూచించారు. విలేకరుల సమావేశంలో ఉత్సవ కమిటీ ప్రెసిడెంట్రాఘవరెడ్డి, వైస్ ప్రెసిడెంట్లు రామరాజు, కృష్ణారెడ్డి, సెక్రెటరీలు మహేందర్, శశిధర్ పాల్గొన్నారు.