బాలీవుడ్ స్టార్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara advani) ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. లేటెస్ట్గా కియారా తన భర్త సిద్దార్థ్ మల్హోత్ర (Sidharthmalhotra)తో ఉన్నఫొటో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో కియారా ధరించిన పొడవాటి చెప్పులు చాలా స్పెషల్ అట్రాక్షన్గా ఉన్నాయి. అంతేకాదు ఈ చెప్పుల బరువు కంటే..వాటి ధర మరింత ఎక్కువంట.
హార్ట్ షేప్లో స్పెషల్గా డిజైన్ చేసిన ఈ వీల్ చెప్పులు విలువ రూ.88 వేలు అని సమాచారం. ఇది తెలుసుకున్న చాలా మంది..ఏంటి ఈ చెప్పులకు ఇంత ధర? చెవిలో పువ్వు పెడుతున్నారేంటీ? అని కొందరు కామెంట్స్ చేస్తే..ఇంకొందరైతే ఈ ధర చూసి నా మూడు నెలల శాలరీ అని అంటున్నారు.
ఇక రీసెంట్గా కియారా వేసుకున్నపొట్టి స్కర్ట్ ధర రూ.98 వేలు ఉండటంతో..బాగా వైరల్ అయింది. ఇప్పుడు మరోసారి కియారా చెప్పులు చూసి షాక్ అవుతున్నారు నెటిజన్స్.
అయితే..కియారా అద్వానీ చాలా స్పెషల్. దానికి కారణం లేకపోలేదు.ఈ ఏడాది గూగుల్లో నెటిజన్స్ అత్యధికంగా సెర్చ్ చేసిన బాలీవుడ్ సెలబ్రిటీగా నిలిచింది. అంతేకాకుండా సిద్దార్థ్ మల్హోత్రతో ప్రేమ,పెళ్లి విషయాలపై నెటిజన్స్ సెర్చ్ చేయడంలో ఇంట్రెస్ట్ చూపించారు.
ప్రస్తుతం కియారా రాంచరణ్తో ‘గేమ్ఛేంజర్’లో నటిస్తోంది. అలాగే హిందీలో సత్యప్రేమ్కి కథ అనే సినిమాలో కూడా నటిస్తున్నవిషయం తెల్సిందే.