లలితా జ్యూవెలరీ షాపులో చోరీ చేసిన కిలాడీ లేడీ అరెస్ట్

లలితా జ్యూవెలరీ షాపులో చోరీ చేసిన కిలాడీ లేడీ అరెస్ట్

సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని లలితా జ్యూవెలరీ షాపులో 2023 డిసెంబర్ 31న బంగారం చోరీ చేసిన కిలాడీ లేడీని ఎబ్బీ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు దగ్గరి నుంచి రూ. 12 లక్షల విలువైన 19 తులాలు బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

కర్మన్ ఘాట్ భూపేష్ గుప్తా నగర్ కి చెందిన గోనెలా గౌతమీగా పోలీసులు గుర్తించారు. గతంలో గౌతమీపై రాచకొండ, హైదరాబాద్, సైబరాబాద్ మూడు కమిషనరేట్స్ పరిధిలో పలు చోరీ కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు.