
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'క' (KA).ఈ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీ వేదికగా జరిగిన 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్'లో ఉత్తమ చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది. ఒక తెలుగు మూవీకి ఈ పురస్కారం రావడంతో అభిమానులు చిత్ర బృందానికి శుభాకాంక్షలు చెబుతూ పోస్టులు పెడుతున్నారు.
కొత్త దర్శకులు సుజిత్, సందీప్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఇందులో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్లుగా నటించారు. గతేడాది (2024) విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. పీరియాడికల్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంగా 'క' ప్రేక్షకులను అలరించింది.
Also Read : రెట్రో vs HIT 3 బాక్సాఫీస్.. ఫస్ట్ డే కలెక్షన్స్.. టాప్లో ఎవరంటే?
కిరణ్ అబ్సవరం కెరీర్లోనే బిగెస్ట్ హిట్గా నిలిచి మంచి వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ దగ్గర రూ.50 కోట్లకి పైగా మైల్ స్టోన్ మార్క్ ను టచ్ చేసింది. దాంతో పార్ట్ 1 విజయం సాధించడంతో పార్ట్ 2ను మరింత ఉత్కంఠగా తెరకెక్కిస్తామని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు.
మరోవైపు ఇప్పటికి 'క' చిత్రం అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతుంది. డాల్బీ విజన్ 40, అట్మాస్ టెక్నాలజీ నుంచి ఓటీటీలోకి వచ్చిన ఫస్ట్ తెలుగు సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది.
కథేంటంటే::
ఈ మూవీ కథంతా 1970-80 బ్యాక్ డ్రాప్లో జరుగుతుంది. అభినయ వాసుదేవ్ (కిరణ్ అబ్బవరం) అనాథ. ఎప్పటికైనా తన తల్లిదండ్రులు తిరిగొస్తారన్న ఆశతో అనాథ ఆశ్రమంలో పెరుగుతాడు. అక్కడే అనుకోకుండా ఎదుటి వాళ్ల ఉత్తరాలు చదివే అలవాటు ఏర్పడుతుంది. ఎవ్వరూలేని తనకు.. ఆ ఉత్తరాల్లోనే తన సొంత వాళ్లు ఉన్నట్టుగా.. వారే తనకు రాసినట్టుగా ఫీల్ అవుతుంటాడు వాసుదేవ్.
అయితే ఓసారి తన ఉత్తరం దొంగతనంగా చదివాడని మాస్టార్ గురునాథం (బలగం జయరాం) వాసును కొట్టడంతో.. ఆశ్రమం నుంచి పారిపోతాడు. ఆ తర్వాత చుట్టూ ఎత్తైన కొండల మధ్య ఓ చిన్న ఊరు (కృష్ణగిరి)కి వెళతాడు. మధ్యాహ్నం 3 గంటలకే చీకటి పడే ఆ ఊర్లో కాంట్రాక్ట్ పోస్ట్మెన్గా ఉద్యోగం చేయడం మొదలుపెడతాడు వాసుదేవ్.
ఈ క్రమంలోనే పోస్ట్మాస్టర్ రంగారావు (అచ్యుత్ కుమార్) కూతురు సత్యభామ (నయన సారిక)తో ప్రేమలో పడతాడు. అనాథ అయిన వాసుదేవ్కి ఆ ఊరి ప్రజలే తన కుటుంబంగా బతుకుతుంటాడు. అంతేకాకుండా వారికీ వచ్చే ఉత్తరాలను చదివి వినిపిస్తుంటాడు. అలా ఉత్తరాలు చదువుతూనే.. ఊళ్ళో జరగబోయే అనర్ధాలను ముందుగానే గుర్తించి కాపాడుతుంటాడు. ఈ క్రమంలో ఓ వ్యక్తిని కోర్టు బయట హత్య కాకుండా కాపాడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మరోవైపు ఆ ఊళ్లో అమ్మాయిలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతుంటారు. ఇలా ఉత్తరాలు చదివే అలవాటున్న వాసుకు.. ఓ లెటర్ వల్ల ఈ మిస్సింగ్ కేసులకు సంబంధించిన క్లూ ఒకటి దొరుకుతుంది. అక్కడి నుంచి వాసుదేవ్ లైఫ్ సమస్యల్లో చిక్కుకుంటుంది. మరి ఊరి అమ్మాయిలు కనిపించకుండా పోవడానికి కారణమెవరు? కృష్ణగిరిలోని లాలా, అబిద్ షేక్ల పాత్రలేంటి?
అసలు ఈ కథను ముందుకు నడిపే ఆ ముసుగు వ్యక్తి ఎవరు? చీకటి గదిలో బంధించిబడిన టీచర్ రాధ( తన్వి రామ్) ఎవరు? అసలు కృష్ణగిరిలో ఏం జరుగుతుంది? వీటన్నిటికీ సమాధానం వెతక్కడం కోసం వాసుదేవ్ ఏం చేశాడు? వంటి తదితర విషయాలకు సమాధానం దొరకాలంటే క మూవీని చూడాల్సిందే.