గోషామహల్ నేత విక్రమ్ గౌడ్​కు కిషన్ రెడ్డి బుజ్జగింపు

గోషామహల్ నేత విక్రమ్ గౌడ్​కు కిషన్ రెడ్డి బుజ్జగింపు

హైదరాబాద్, వెలుగు : మాజీ మంత్రి, గోషామహల్​కు చెందిన బీజేపీ నేత ముఖేశ్​ గౌడ్ కొడుకు విక్రమ్ గౌడ్ కాంగ్రెస్​లో చేరుతారనే ప్రచారం జరిగింది. దీంతో ఆయనను గురువారం బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యాలయానికి పిలిపించుకొని బుజ్జగించారు. గోషామహల్ ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడడంతో అప్పటి నుంచి ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. దీంతో విక్రమ్ కు పార్టీలో సముచిత స్థానం ఇస్తామని ఆఫీసుకు పిలిపించుకొని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. 

బీజేపీ స్టేట్ ఆఫీసులో  బ్రెయిలీ జయంతి వేడుకలు

అంధుల అక్షర ప్రధాత లూయిస్ బ్రెయిలీ జయంతి సందర్భంగా గురువారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన చిత్ర పటానికి పలువురు బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కిషన్ రెడ్డితో పాటు పలువురు పార్టీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బ్రెయిలీ సేవలను వారు స్మరించుకున్నారు.