కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఓటు వేస్తే వృథానే : కిషన్​రెడ్డి

కాంగ్రెస్, బీఆర్ఎస్​కు ఓటు వేస్తే వృథానే : కిషన్​రెడ్డి
  • కేంద్రంలో మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమే 
  • నాంపల్లిలో సికింద్రాబాద్​బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్​రెడ్డి ప్రచారం

మెహిదీపట్నం/సికింద్రాబాద్, వెలుగు: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే వృథానే అని సికింద్రాబాద్​ బీజేపీ ఎంపీ అభ్యర్థి కిషన్​రెడ్డి చెప్పారు. కేంద్రంలో మళ్లీ వచ్చేది మోదీ ప్రభుత్వమేనన్నారు. బుధవారం ఆయన నాంపల్లి నియోజకవర్గంలోని తాళ్లగడ్డ జైన్ మందిర్ నుంచి ప్రచార యాత్ర నిర్వహించారు. శారదానగర్, నవోదయ కాలనీ, హుడా కాలనీ, శ్రీరామ్ నగర్, రేతిబౌలి, మిలాన్ టాకీస్, కుమ్మరవాడి మీదుగా ఇందిరానగర్, బోయగూడ, కమాన్ బజార్ ఘాట్, గోకుల్ నగర్, గోల్కొండ హోటల్, పెన్షన్ ఆఫీస్, శ్రీరామ్ టెంపుల్, హైమద్ నగర్ వరకు కొనసాగింది. 

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని బీఆర్ఎస్​పదేండ్లు దోచుకుంటే.. ఆరు గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తోందన్నారు. దేశం కోసం, పిల్లల భవిష్యత్​ కోసం బీజేపీకి ఓటు వేయాలని కోరారు. సికింద్రాబాద్​ఎంపీగా మరోసారి తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట పార్టీ లీడర్​దేవర వంశీ, స్థానిక నాయకులు ఉన్నారు. అలాగే కిషన్ రెడ్డికి మద్దతుగా మాజీ మేయర్ కార్తీకారెడ్డి బుధవారం తార్నాకలో ప్రచారం నిర్వహించారు