బషీర్ బాగ్, వెలుగు: దేశాభివృద్ధే లక్ష్యంగా ప్రధాని మోదీ పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. ఆదివారం నారాయణగూడ కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాలేజీ సర్దార్ పటేల్ ఆడిటోరియంలో జరిగిన వికసిత్ భారత్ అంబాసిడర్ల సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి, రాజస్థాన్ రాష్ట్ర మంత్రి రాజవర్ధన్ సింగ్ రాథోడ్తో కలిసి కిషన్ రెడ్డి పాల్గొన్నారు.
2047 నాటికి వికసిత్ భారత్ రూపుదిద్దుకుంటుందన్నారు. దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని చెప్పారు. నమో యాప్ కోఆర్డినేటర్ శైలేష్ పాండే, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అమర్ నాథ్ సారంగుల, సోషల్ మీడియా కన్వీనర్ సుమిరాన్ కొమర్రాజు పాల్గొన్నారు.