బషీర్ బాగ్, వెలుగు: నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులు భవితవ్యంపై నోరు మెదపని కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రిగా కొనసాగే నైతిక హక్కు లేదని విద్యార్థి, యువజన సంఘాల ఐక్య కార్యాచరణ సమితి పేర్కొంది. నీట్ యూజీసీ పరీక్షా అంశంపై స్పందించాలని విద్యార్థి, యువజన సంఘాల నేతలు శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినా పట్టించుకోలేదని సమితి నాయకులు మండిపడ్డారు. అందుకు నిరసనగా సంఘాల ఆధ్వర్యంలో చేపట్టిన కిషన్ రెడ్డి ఇంటి ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తతకు దారి తీసింది. కాచిగూడలోని ఆయన ఇంటి ముట్టడికి యత్నించిన విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి నల్లకుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మాట్లాడుతూ.. కిషన్ రెడ్డికి గనుల వేలం పాటపై ఉన్న శ్రద్ధ, లక్షల మంది విద్యార్థుల అంశంపై లేకపోవడం సిగ్గు చేటన్నారు. నీట్ పేపర్ లీకేజీ అంశంపై ప్రధాని మోదీ ఛాయ్ పే చర్చా కార్యక్రమాన్ని నిర్వహించేలా కిషన్ రెడ్డి ఆయనను అడగాలని డిమాండ్ చేశారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. నీట్ పరీక్షను మళ్లీ నిర్వహించాలని, పరీక్ష నిర్వహణలో పారదర్శకత లేని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ)ను రద్దు చేయాలని కోరారు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే తమ పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ ముట్టడిలో ఎన్ఎస్యూఐ, ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూఎస్, ఏఐవైఎఫ్, డీవైఎఫ్ఐ, పీవైఎల్ఎం నాయకులు పాల్గొన్నారు.
నీట్పై కిషన్ రెడ్డి స్పందించాలి
- హైదరాబాద్
- June 23, 2024
లేటెస్ట్
- పేదలకు భారీ గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇండ్ల పంపిణీపై ప్రభుత్వం కీలక ప్రకటన
- ఈడీకు మరో కంప్లైంట్.. ఐఏఎస్ అమోయ్ కుమార్కు బిగుస్తోన్న ఉచ్చు
- 100 యూట్యూబ్ ఛానెళ్లతో బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం: మంత్రి పొంగులేటి
- David Warner: వార్నర్పై 'కెప్టెన్సీ' నిషేధం ఎత్తివేత
- Jio: జియో నుంచి దీపావళి గిఫ్ట్.. నిజంగానే పండగ చేస్కోండి..!
- Israel, Iran War:శతృత్వంతో ఎవరీకి లాభం ఉండదు..ఇరాన్పై ఇజ్రాయెల్ దాడి..భారత్ స్పందన
- హైదరాబాద్ నగర ప్రజలకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్..
- 20వేల మందితో విజయ్ పొలిటికల్ పార్టీ భారీ బహిరంగ సభ..
- క్రీడా మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. ధ్యాన్ చంద్ అవార్డు నిలిపివేత
- హైడ్రా ఐరన్ అమ్ముకోలే: బిల్డర్ ఆరోపణలపై కమిషనర్ రంగనాథ్ క్లారిటీ
Most Read News
- Good News :తగ్గిన బంగారం ధరలు
- IND vs NZ 2nd Test: కోహ్లీకే ఎందుకిలా.. అంపైర్లు ఎందుకు పగ బడుతున్నారు
- పత్తి ధర పెంచాల్సిందే.. ఆదిలాబాద్ మార్కెట్ లో రైతుల ఆందోళన
- Team India: ఇకనైనా బుద్ధిగా ఉండు కొడకా..! భారత యువ క్రికెటర్కు తల్లి సలహా
- ప్రభుత్వ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్.. 2 డీఏల విడుదలకు గ్రీన్ సిగ్నల్
- Yes Bank ఇన్వెస్టర్లకు గుడ్ న్యూస్..సెప్టెంబర్ త్రైమాసికంలో భారీ లాభాలు..
- డిగ్రీతో బ్యాంక్ ఉద్యోగాల జాతర.. వెంటనే అప్లై చేసుకోండి
- ఇందిరమ్మ ఇండ్ల కోసం ప్రత్యేక యాప్
- బీఆర్ఎస్ లీడర్లకు బిగుసుకుంటున్న.. పాలమూరు ల్యాండ్ స్కామ్
- పత్తి అమ్మాలంటే కర్నాటక వెళ్లాల్సిందే!....పక్క రాష్ట్రంలో పత్తి అమ్ముకోలేక రైతుల తిప్పలు