
బంగ్లాదేశ్ టూర్లో టీమిండియాను గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గాయం కారణంగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు..బౌలర్ సైనీ వంటి ప్లేయర్లు టెస్టు సిరీస్కు దూరం కాగా... కెప్టెన్ కేఎల్ రాహుల్ కూడా రెండో టెస్టుకు దూరం అయ్యే ఛాన్సుంది. కేఎల్ రాహుల్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా..గాయపడ్డాడు. ఈ మేరకు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ తెలిపారు. ప్రస్తుతం రాహుల్ను డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. రెండో టెస్టులో ఆడతాడా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేమని వెల్లడించారు.
కేఎల్ రాహుల్ నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుండగా గాయపడ్డాడని బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ వెల్లడించాడు. అయితే అతని గాయం తీవ్రంగా కనిపించడం లేదన్నాడు. వైద్యులు రాహుల్ను పర్యవేక్షిస్తున్నారని..రాహుల్ కోలుకుంటాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. ఒక వేళ రాహుల్ రెండో టెస్టులో ఆడకపోతే..వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తున్న పూజారాకు కెప్టెన్సీని అప్పగించే అవకాశాలున్నాయని తెలిపాడు.
బంగ్లాతో జరిగిన రెండో వన్డేలో బొటనవేలికి గాయమై రోహిత్ శర్మ మూడో వన్డేకు దూరమయ్యాడు. ఆ తర్వాత తొలి టెస్టులోనూ ఆడలేదు. గాయం తగ్గకపోవడంతో రెండూ టెస్టుకూ దూరమయ్యాడు. రెండు మ్యాచుల టెస్టు సిరీస్లో టీమిండియా తొలి టెస్టులో 188 పరుగుల తేడాతో విజయం సాధించింది. డిసెంబరు 22 నుంచి భారత్, బంగ్లా మధ్య రెండో టెస్టు జరగనుంది. అటు టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ పోరులో నిలవాలంటే.. టీమిండియా రెండో టెస్టులోనూ గెలవాల్సి ఉంటుంది.