రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు : ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలులో భాగంగా గురువారం రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లకు, కౌన్సిలర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇందులో రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ టి.కె.శ్రీదేవి, అడిషనల్కలెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
