తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతుంది

తెలంగాణలో నిరంకుశ పాలన సాగుతుంది

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్బంగా  TJS పార్టీ  అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం నాంపల్లి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేశారు. సుదీర్ఘ పోరాటాల ఫలితం గా తెలంగాణ సాధించుకున్నామని చెప్పారు. స్వరాష్ట్రం కోసం ప్రజలు ఉద్యమాలు చేశారని..తెలంగాణ ఒక వ్యక్తి వల్ల వచ్చింది కాదన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం చాలా మంది యువకులు బలిదానాలు చేసుకున్నారన్నారు. ఎన్నో ఆశలు..ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు నిరంకుశ పాలన సాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపై ఉద్యమాలు చేస్తామని చెప్పారు. తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవం కోరుకుంటున్నారని..రాష్ట్రం లో ఆంధ్ర దోపిడీ దారుల రాజ్యం నడుస్తుందన్నారు. ఉద్యమ కారులు ఒకతాటిపైకి రావాలని..ఈనెల 6వ తేదీన ఇందిరా పార్కు దగ్గర ఆత్మ గౌరవ దీక్ష చేపడతామన్నారు. ఈ దీక్షలో ఉద్యమ కారులు అందరు పాల్గొన్నాలని పిలుపునిచ్చారు. 

మరిన్ని వార్తల కోసం

‘బుర్జ్ ఖలీఫా’పై ‘విక్రమ్’ ట్రైలర్

కేసీఆర్ పాలనలో రాష్ట్రం ముందడుగు