
సీఎం కేసీఆర్ వైఖరి తెలంగాణ ప్రజల పట్ల శాపంగా మారిందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ఆరోపించారు. తెలంగాణ వస్తే అనేక వర్గాల ప్రజలు అభివృద్ది చెందుతారని భావించినా కేసీఆర్ నియంత పోకడతో అది సాధ్యం కాలేదని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటానన్న సీఎం ... ఇప్పటి వారికి ఎందుకు సహాయం అందించలేదని ప్రశ్నించారు. అనేక హామీలు ఇచ్చి నేరవేర్చని సీఎంను మళ్లీ మీ దగ్గరకు వస్తే నిరుద్యోగ భృతి గురించి అడగాలని ప్రజలకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలను అమ్ముకొని నిరుద్యోగుల పొట్ట కొడుతుందని ప్రొఫెపర్ కోదండరాం అన్నారు. కేసీఆర్ కుటుంబం చేతిలో బందీగా ఉన్న తెలంగాణను విడిపించి.. రాష్ట్రాన్ని కాపాడేందుకు అందరూ కలవాలన్నారు. ప్రజల హక్కుల కోసం పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.