విరాట్ అద్భుత రికార్డ్ : 20వేల రన్స్ మార్క్ దాటేశాడు

విరాట్ అద్భుత రికార్డ్ : 20వేల రన్స్ మార్క్ దాటేశాడు

మాంచెస్టర్ : పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన అకౌంట్ లో వేసుకున్నడు. ఇంటర్నేషనల్ మ్యాచుల్లో 20వేల రన్స్ ఫినిష్ చేసి, రికార్డ్ నెలకొల్పాడు. వరల్డ్ కప్-2019లో భాగంగా గురువారం వెస్ట్ ఇండీస్ తో జరుగుతున్న మ్యాచ్ లో కోహ్లీ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్ ప్రారంభంలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కోహ్లీ ఆచితూచి ఆడుతు రన్ రేట్ ను పెంచాడు. ఈ క్రమంలో  25 ఓవర్ లో సింగిల్ తీసిన కోహ్లీ తన వ్యక్తిగత స్కోర్ 37 రన్స్ తో 20 వేల రన్స్ కు చేరాడు.

ఇప్పటికే ఇంటర్నేషనల్ క్రికెట్ కెరీర్‌లో ఎక్కువ రన్స్ చేసిన వారిలో ఇండియా నుంచి సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్ ఉన్నారు. వీళ్ల తర్వాత ఇప్పుడు మూడో వ్యక్తిగా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. సచిన్ టెండుల్కర్ 34 వేల 357 రన్స్ చేయగా… రాహుల్ ద్రవిడ్ 24వేల208 రన్స్ చేశాడు. ప్రపంచం మొత్తం మీద చూస్తే ఈ రికార్డు సాధించిన 12వ ప్లేయర్ గా కోహ్లీ చరిత్ర సృష్టించాడు. కోహ్లీ ఇప్పటి వరకు 417 ఇన్నింగ్స్ ఆడగా… టెస్టుల్లో 131, వన్డేల్లో 224, టీ20ల్లో 62 ఇన్నింగ్స్ ఆడాడు.