
కోల్కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్ చంద్రకాంత్ పండిట్ తన పదవి నుంచి తప్పుకున్నాడు. మంగళవారం (జూలై 29) కేకేఆర్ ఈ విషయాన్ని అధికారికంగా తెలిపింది. 2024లో చంద్రకాంత్ పండిట్ హయాంలో కేకేఆర్ టైటిల్ విజేతగా నిలిచింది. అయితే ఆ క్రెడిట్ మొత్తం ఫ్రాంచైజీ మెంటర్ గౌతమ్ గంభీర్ కు దక్కింది. 2025 లో అజింక్య రహానే కెప్టెన్సీలోని కేకేఆర్ జట్టు 14 మ్యాచ్లలో కేవలం 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో నిలిచింది. పేలవ ప్రదర్శన కారణంగా చంద్రకాంత్ పై విమర్శల వర్షం వచ్చింది.
"చంద్రకాంత్ పండిట్ కొత్త అవకాశాల కోసం వెతుక్కుంటున్నాడు. ఆయన కోల్కతా నైట్ రైడర్స్ ప్రధాన కోచ్గా కొనసాగడం లేదు. 2024లో కేకేఆర్ ను ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిపినందుకు.. బలమైన జట్టును నిర్మించడంలో సహాయపడినందుకు అమూల్యమైన కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అతని నాయకత్వం, క్రమశిక్షణ జట్టుపై శాశ్వత ప్రభావాన్ని చూపాయి". అని KKR వారి అధికారిక ప్రకటనలో చెప్పుకొచ్చింది. 2023 ఐపీఎల్ ఎడిషన్ కు ముందు చంద్రకాంత్ పండిట్ ను కేకేఆర్ కోచ్ గా జట్టులో చేరాడు.
ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత ఇంగ్లాండ్ టెస్ట్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెకల్లమ్ స్థానంలో చంద్రకాంత్ పండిట్ నియమితులయ్యారు. తన తొలి సీజన్ (2023) లో జట్టు ఏడో స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో రెగ్యులర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయం కారణంగా దూరమయ్యాడు. 2024 లో శ్రేయాస్ కెప్టెన్సీలో కోల్కతా నైట్ రైడర్స్ అద్భుతంగా ఆడి టైటిల్ గెలిచింది. 2025 ఐపీఎల్ సీజన్ లో కేకేఆర్ ప్లే ఆఫ్స్ కు చేరకపోవడంతో ఆయన తన ప్రధాన కోచ్ పదవికి రాజీనామా చేశారు.