రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నది:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నది:కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

శంషాబాద్, వెలుగు: రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతున్నదని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. గురువారం రాత్రి ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న రాజగోపాల్ అక్కడ మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో ప్రజల సొమ్మును దోచుకుంటున్న కల్వకుంట్ల కుటుంబం, మంత్రులు, ఎమ్మెల్యేలు జైలుకు వెళ్లడం ఖాయం. కల్వకుంట్ల కుటుంబం జైలుకు వెళ్లకపోతే నా పేరు మార్చుకుంటా” అని అన్నారు.

ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాలను కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారు. లిక్కర్ స్కామ్‌‌‌‌లో కవితను కాపాడుకోవడానికి కల్వకుంట్ల కుటుంబంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు శ్రమిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా కాంగ్రెస్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి, టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారని మండిపడ్డారు.