నిర్మల్/భైంసా, వెలుగు: బంగారు తెలంగా ణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబానికే పరిమితమైందని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి విమర్శించారు. సోమవారం నిర్మల్, భైంసాలో నిర్వహించిన ప్రెస్మీట్లలో రాజగోపాల్రెడ్డి మాట్లాడారు. భైంసా బహిరంగ సభను రద్దు చేసేందుకు టీఆర్ఎస్ సర్కారు కుటిల ప్రయత్నాలు చేసిందన్నారు. ఎన్నికలెప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు.
కాంగ్రెస్లో భవిష్యత్తు లేకనే బీజేపీలో చేరానని, తన తర్వాత రామారావు పటేల్ లాంటి దమ్మున్నసీనియర్ లీడర్లు బీజేపీలోకి వస్తున్నారన్నారు. నిజాయితీగా పని చేసే వ్యక్తి రామారావు పటేల్ బీజేపీలో చేరడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. లీడర్లు రావుల రాంనాథ్, అయ్యన్నగారి భూమయ్య, గంగాధర్ పాల్గొన్నారు.