కుర్చేసుకుని కూసుంట అన్నోళ్లు ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలే

కుర్చేసుకుని కూసుంట అన్నోళ్లు ఎస్ఎల్బీసీని ఎందుకు పూర్తి చేయలే

బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. తాము ఎంతో కష్టపడి క్లియరెన్స్ చేసి తెచ్చిన ఎస్ఎల్బీసీ ప్రాజెక్టును బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. 2005లో సంక్షన్ చేయబడిందని 2013కు వచ్చే సరికి మ్యానువల టన్నల్ పనులు చాలా వరకు ఫినిష్ చేశామని అన్నారు. మెయిన్ టన్నల్ ఫినిషింగ్ స్టేజిలో ఉందని చెప్పారు. 2013 ఎన్నికల ప్రచారానికి సూర్యాపేటలో బీఆర్ఎస్ నాయకులు బహిరంగ సభలో ఓ మాట తమ పై దూషణలు చేశారని చెప్పారు. 

ఎస్ఎల్బీసీ సొరంగం తరుగుతలేదని రేపు తెలంగాణ వచ్చిన తర్వాత ఇక్కడే కుర్చీ వేసుకుని ప్రాజెక్టును పూర్తి చేస్తానని వాగ్దానాలు చేశారని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గుర్తుచేశారు. అది పూర్తి చేసి ఉంటే పోతిరెడ్డి పాడు ఉండక పోతుండేదని అన్నారు.  బీఆర్ఎస్ నాయకుల కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు.