3 నెలల్లో బీఆర్ఎస్ పునాదులు కూలుస్తం...కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

3 నెలల్లో బీఆర్ఎస్ పునాదులు కూలుస్తం...కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సంగారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  స్ట్రాంగ్​కౌంటర్​ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే మూడునెలల్లో బీఆర్ఎస్ పునాదులు కూలుస్తామని వార్నింగ్​ఇచ్చారు.నల్లగొండలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కేసీఆర్​నిన్ను.. నీ పార్టీ 3 నెలల్లో రాజకీయంగా బొందపెడ్తం. ఒకసారి మమ్మల్ని టచ్​చేసి చూడు. మా​పార్టీ వీర సైనికులే నీ బీఆర్ఎస్​పార్టీని పునాదులు లేకుండా చేస్తరు. గుర్తుపెట్టుకో బిడ్డా. గత కొద్దిరోజులుగా నీ కొడుకు కేటీఆర్​ఇలాంటి మాటలే మాట్లాడుతుంటే బచ్చాగాడు.. రాజకీయాలు తెలీయవు పోనీలే అని ఊరుకుంటున్నం. ఇప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్​ప్రభుత్వాన్ని కూల్చేస్తానని మాట్లాడడం నీ మూర్ఖత్వానికి అర్థం పడుతోంది. ఓ పాస్​పార్ట్ దొంగవు నువ్వు సీఎం కాగా లేనిది.. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి.. రాజకీయాల్లో స్వతంత్రంగా ఎదిగి.. కష్టపడి సీఎం పదవి చేపట్టిన రేవంత్​రెడ్డికి నీకు పోలీకా. దేశంలోనే దరిద్రమైన పాలన అందించిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది.. రేవంత్ రెడ్డి ముఖం చూడలేక కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. మేము గేట్లు తెరిస్తే.. 4నలుగురు తప్ప బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరు. మెదక్ లో వెయ్యి కోట్లు ఖర్చు చేసినా కూడా మీరు గెల్వరు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో 15 ఎంపీ సీట్లు గెలుస్తది’ అని మంత్రి ధీమావ్యక్తంచేశారు.

పాపాలకు ప్రాయశ్చితం చేసుకో

‘కేసీఆర్.. నీ కుటుంబాన్ని చూసే జాలేస్తుంది. కవిత అవినీతి అక్రమాలతో తీహార్ జైలులో ఉన్నరు. ఆమె రెండేండ్ల దాకా బయటకు రాదు. బిడ్డ చేసిన పనికి క్షమాపణలు చెప్పి పాపాలకు ప్రాయశ్చితం చేసుకో. ఫోన్​ట్యాపింగ్​కేసులో  కేసీఆర్, కేటీఆర్ జైలుకు పోతరు. రావులు అందరూ జైలుకు వెళ్తే చర్లపల్లి జైల్ సరిపోదు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ వ్యవహారంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి జైలుకు వెళ్తారు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్ను పోటు పొడిచిన వ్యవహారంలో కేసీఆర్ కూడాఉన్నరు’అని కోమటిరెడ్డి అన్నారు.