ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు ఖాయం : కొమ్మూరి ప్రతాప్​రెడ్డి 

ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్​ గెలుపు ఖాయం : కొమ్మూరి ప్రతాప్​రెడ్డి 

జనగామ అర్బన్, వెలుగు: పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్​రెడ్డి విజయానికి కృషి చేయాలని జనగామ డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్​రెడ్డి అన్నారు. గురువారం కాంగ్రెస్​జిల్లా ఆఫీస్ లో ఏర్పాటు చేసిన కార్యకర్తల మీటింగ్ లో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 14 పార్లమెంట్​స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

మండలంలోని వివిధ గ్రామాల మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్ అరవింద్​తో పాటు సుమారు రెండు వందల మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో చెంచారపు శ్రీనివాస్ రెడ్డి, బుచ్చిరెడ్డి, శివరాజ్, వంగాల కల్యాణి, వంగాల మల్లారెడ్డి, మేడ శ్రీనివాస్, జక్కుల వేణుమాధవ్, ఉమాపతి రెడ్డి, బడికె కృష్ణస్వామి తదితరులు పాల్గొన్నారు.