కొండా సురేఖకు ప్రమాదం

కొండా సురేఖకు ప్రమాదం

కాంగ్రెస్ నాయకురాలు కొండా సురేఖ ప్రమాదానికి గురయ్యారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ బైక్ ర్యాలీలో ఆమె స్కూటీ నడుపుతుండగా కిందపడిపోయారు. దీంతో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. 
 
తెలంగాణ ఎన్నికల వేళ రాహుల్ గాంధీ విజయభేరి పేరిట బస్సు యాత్రలో పాల్గొన్నారు. ఈ విజయభేరి యాత్రలో భాగంగా అక్టోబర్ 19వ తేదీన భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి రాహుల్ గాంధీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో కొండా సురేఖ కూడా పాల్గొన్నారు. అయితే స్కూటీ నడుపుతుండగా అదుపుతప్పడంతో కిందపడిపోయారు. దీంతో ఆమె ముఖంతో పాటు చేతులకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను ఆసుపత్రికి తరలించారు.