మహేశ్వరంలో బీజేపీ జెండా ఎగరాలి :  కొండా విశ్వేశ్వర్ రెడ్డి

మహేశ్వరంలో బీజేపీ జెండా ఎగరాలి :  కొండా విశ్వేశ్వర్ రెడ్డి

బడంగ్ పేట, వెలుగు: తాగుబోతు ముఖ్యమంత్రి కేసీఆర్​ను ఓడించాలని మాజీ ఎంపీ, బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మహేశ్వరం  బీజేపీ అభ్యర్థి అందెల శ్రీరాములుకు మద్దతుగా బుధవారం ఆయన ప్రచారం నిర్వహించారు. ఆర్​కే పురం డివిజన్ టీఎన్ఆర్ చౌరస్తా వద్ద కార్నర్ మీటింగ్​లో పాల్గొని మాట్లాడారు. ఎన్ని గ్యారెంటీలు ఇచ్చిన తెలంగాణ ప్రజలు కాంగ్రెస్​ను నమ్మరన్నారు. కాంగ్రెస్  నుంచి గెలుపొంది సొంత ప్రయోజనాలకు పార్టీ మారిన సబితను మహేశ్వరం ప్రజలు విశ్వసించరన్నారు.

ధర్మం కోసం.. దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ప్రధాని మోదీ నాయకత్వంలోనే దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లో అభ్యున్నతి సాధిస్తుందన్నారు.  మహేశ్వరంలో బీజేపీ జెండా ఎగరాలని, పార్టీ అభ్యర్థి అందెల శ్రీరాములు యాదవ్​ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.  సమావేశంలో ఆర్​కే పురం కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి పిట్ట ఉపేందర్ రెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.