అంజన్న హుండీ ఆదాయం రూ.83 లక్షలు

అంజన్న హుండీ ఆదాయం రూ.83 లక్షలు

కొండగట్టు, వెలుగు: జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న సన్నిధిలోని తొమ్మిది హుండీలను గురువారం లెక్కించారు. గడిచిన 28 రోజుల్లో భక్తులు కానుకల రూపంలో రూ.83లక్షల91వేల502 క్యాష్, 32 గ్రాముల మిశ్రమ బంగారం, 4.5 కిలోల మిశ్రమ వెండి, 13 విదేశీ కరెన్సీ నోట్లు సమర్పించారు. హుండీల లెక్కింపును ఆలయ ఈఓ వెంకటేశ్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, ఏఈఓ అంజయ్య, సూపరింటెండెంట్లు శ్రీనివాసశర్మ, సునీల్ పర్యవేక్షించారు.