కాంగ్రెస్ పార్టీకి కొత్త జయపాల్ రెడ్డి రాజీనామా

కాంగ్రెస్ పార్టీకి కొత్త జయపాల్ రెడ్డి రాజీనామా
  • నేడు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లోకి..

కరీంనగర్ టౌన్, వెలుగు : కరీంనగర్​ జిల్లాకు చెందిన కాంగ్రెస్​ నేత కొత్త జయపాల్ రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. సోమవారం రిజైన్​ లెటర్​ను గాంధీభవన్‌కు పంపినట్లు తెలిపారు. టికెట్ ఇస్తామన్న స్పష్టమైన హామీతో పార్టీలో చేరానని అయితే, టికెట్​ రాకపోగా.. పార్టీలో అంతర్గత కలహాలు, టికెట్ల కేటాయింపులో అవకతవకలతో కలత చెంది కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు.

గెలిచే వారికి టికెట్ ఇవ్వడం లేదని ఆరోపించారు. మంగళవారం బీఆర్ఎస్‌లో చేరనున్నట్లు జయపాల్‌రెడ్డి  ప్రకటించారు. సోమవారం సీఎం కేసీఆర్‌‌ను తెలంగాణ భవన్‌లో  మర్యాదపూర్వకంగా కలిశారు.