కాంగ్రెస్​లోకి కొత్త జైపాల్​ రెడ్డి.. రేవంత్​ రెడ్డి సమక్షంలో జాయిన్

కాంగ్రెస్​లోకి కొత్త జైపాల్​ రెడ్డి.. రేవంత్​ రెడ్డి సమక్షంలో జాయిన్

హైదరాబాద్, వెలుగు: మైత్రి గ్రూప్​ చైర్మన్​ కొత్త జైపాల్​ రెడ్డి కాంగ్రెస్​ పార్టీలో చేరారు. గురువారం సాయంత్రం కరీంనగర్​ నుంచి పెద్ద సంఖ్యలో తన అనుచరులతో  ఆయన గాంధీభవన్​కు వచ్చారు. పీసీసీ చీఫ్​ రేవంత్​ రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు.  అనంతరం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మాణిక్​ రావు ఠాక్రేతో కొత్త జైపాల్​ రెడ్డి కాసేపు భేటీ అయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన.. తనకు కరీంనగర్​ టికెట్​ఇవ్వాలని ఠాక్రేకు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. వాస్తవానికి బీఆర్ఎస్​లోకి తీసుకొచ్చేందుకు మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్​ బోర్డు వైస్​ చైర్మ న్​ వినోద్​ కుమార్ ​ఇటీవల కొత్త జైపాల్​ రెడ్డితో చర్చలు జరిపారు. అయితే, ఆయన రాకను చొప్పదండికి చెందిన పలువురు బీఆర్ఎస్​నేతలు వ్యతిరేకించారు.