హైదరాబాద్, వెలుగు: మైత్రి గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం సాయంత్రం కరీంనగర్ నుంచి పెద్ద సంఖ్యలో తన అనుచరులతో ఆయన గాంధీభవన్కు వచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో పార్టీలో జాయిన్ అయ్యారు. అనంతరం ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రేతో కొత్త జైపాల్ రెడ్డి కాసేపు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఆయన.. తనకు కరీంనగర్ టికెట్ఇవ్వాలని ఠాక్రేకు విజ్ఞప్తి చేసినట్టు తెలిసింది. వాస్తవానికి బీఆర్ఎస్లోకి తీసుకొచ్చేందుకు మంత్రి గంగుల కమలాకర్, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మ న్ వినోద్ కుమార్ ఇటీవల కొత్త జైపాల్ రెడ్డితో చర్చలు జరిపారు. అయితే, ఆయన రాకను చొప్పదండికి చెందిన పలువురు బీఆర్ఎస్నేతలు వ్యతిరేకించారు.