- కారు పార్టీ నిలబడటమే కష్టం
- కమ్యూనిస్టులు ఉంటేనే ఇండియా కూటమికి బలం
- కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు
హైదరాబాద్: కాళేశ్వరం ఎలా కుంగిపోయిందో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి అంతే అని కొత్తగూడెం సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. బీఆర్ఎస్లో తెలంగాణ సెంటిమెంట్ లేదని, ఆ పార్టీ ఇప్పుడు నిలబడటమే కష్టంగా ఉందన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీతో మా స్నేహం కొనసాగుతుంది.
లోక్సభ ఎన్నికల కోసం నల్గొండ, ఖమ్మం, పెద్దపల్లి, భువనగిరి, వరంగల్ స్థానాలు కావాలని అడిగాం. కనీసం ఒక్కటన్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నం. కమ్యూనిస్టులు ఉంటేనే ఇండియా కూటమికి బలం. ఎప్పటికైనా వామపక్షాలు ఏకం కావాలి. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలి’ అని కూనంనేని పిలుపునిచ్చారు.