కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రి ఈటలకు మద్దతు పెరుగుతోంది. ఇటీవల జమ్మికుంట, వీణవంకలో ఈటలకు అండగా ఉంటామని కొందరు నేతలు చెప్పారు. ఇపుడు కొత్తపల్లిలో మున్సిపల్ వైస్ చైర్మన్ దేసిని స్వప్న ఈటలకు మద్దతుగా నిలిచారు. ఆమె ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ కు 13మంది కౌన్సికర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మాజీ మంత్రి ఈటల నాయకత్వంలో పని చేస్తామన్నారు. కొందరు టీఆర్ఎస్ నాయకులు మంత్రుల దగ్గరి నుండి బెదిరింపులకు దిగుతున్నారన్నారు. హుజురాబాద్ నియోజక వర్గ ప్రజల గుండెల్లో నుండి ఈటెల రాజేందర్ ను తీసివేయలేరన్నారు. ఉద్యమ నాయకుడి మీద భూ కబ్జా ఆరోపణలు చేయడం సరికాదన్నారు. హుజురాబాద్ నియోజక వర్గంలో అణచివేత ధోరణి సాగిస్తున్నారన్నారు. తల్లి నుండి బిడ్డను వేరు చేసినట్లు నియోజకవర్గ ప్రజల నుండి ఈటలను వేరు చేయాలనుకోవడం సమంజసం కాదన్నారు. తామందరం ఈటల ఫోటో పెట్టుకొని గెలిచామన్నారు. ఆయన దయ వల్లనే తమకు పదవులు వచ్చాయన్నారు.