జూన్ 26 నుంచి కేపీఆర్‌‌ ఆల్‌‌ ఇండియా ఓపెన్‌‌ చెస్‌‌ టోర్నీ

జూన్ 26 నుంచి కేపీఆర్‌‌ ఆల్‌‌ ఇండియా ఓపెన్‌‌ చెస్‌‌ టోర్నీ

హైదరాబాద్‌‌: కేపీఆర్‌‌ ఆల్‌‌ ఇండియా ఓపెన్‌‌ ఫిడే రేటింగ్‌‌ చెస్‌‌ టోర్నీ 26 నుంచి 30 వరకు ఎల్బీ స్టేడియంలో జరగనుంది. ఇందులో విజేతగా నిలిచిన వారికి గ్రాండ్‌‌ మాస్టర్‌‌ కోనేరు హంపి గ్రాండ్‌‌ ఫాదర్‌‌ కోనేరు పూర్ణచంద్రరావు ట్రోఫీని, రూ. 75 వేల నగదు పురస్కారాన్ని ఇవ్వనున్నారు. 

టోర్నీ ప్రైజ్‌‌మనీ మొత్తం రూ. 8.05 లక్షలు. అండర్‌‌–7, 9, 11, 13, 19 ప్లేయర్ల కోసం రూ. 3 లక్షలు కేటాయించారు. ఒక్కొక్కరికి రూ. 5 వేల చొప్పున మొత్తం 110 నగదు బహుమతులను అందజేయనున్నారు. హైదరాబాద్‌‌ జిల్లా చెస్‌‌ అసోసియేషన్‌‌ ఆధ్వర్యంలో ఈ టోర్నీ నిర్వహించనున్నారు. ఆసక్తిగల క్రీడాకారులు  7337578899 లేదా 7337399299 మొబైల్‌‌ నంబర్లలో సంప్రదించవచ్చు.