కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్ సిటీలోని కోట పబ్లిక్ స్కూల్లో ఈనెల 14న 3 నుంచి 9వ తరగతి విద్యార్థులకు టాలెంట్ ఎంకరేజ్ మెంట్ ఎగ్జామ్–2026 నిర్వహిస్తున్నట్లు చైర్మన్ డాక్టర్ డి.అంజిరెడ్డి తెలిపారు. ఆదివారం కేపీఎస్లో ఎగ్జామ్ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ఎగ్జామ్లో అర్హత సాధించిన విద్యార్థులకు 100శాతం స్కాలర్ షిప్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఐఐటీ, జేఈఈ, నీట్, ఒలింపియాడ్ తదితర జాతీయ స్థాయి పరీక్షలకు 6వ తరగతి నుంచే ప్రత్యక్ష శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. పరీక్షకు పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
