జనవరిలో కృష్ణా బోర్డు మీటింగ్ : చైర్మన్

జనవరిలో కృష్ణా బోర్డు మీటింగ్ : చైర్మన్
  •     ఎజెండా అంశాలు పంపాలని రెండు రాష్ట్రాలకూ లేఖ

హైదరాబాద్, వెలుగు: పోస్ట్​ మాన్సూన్​సమావేశానికి కృష్ణా రివర్​మేనేజ్​మెంట్​బోర్డు (కేఆర్​ఎంబీ) రెడీ అవుతున్నది. జనవరిలో 21వ బోర్డు సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 30 నాటికి బోర్డు సభ్యులు తమ ఎజెండా అంశాలను పంపాలని చైర్మన్ కోరారు. 

ఈ మేరకు మెంబర్​సెక్రటరీ ఎస్​కే కాంబోజ్​.. రెండు రాష్ట్రాలకూ లేఖ రాశారు. జలసౌధ వేదికగా ఈ సమావేశం జరగనుంది. కాగా, ఈ ఏడాది జులై 5న బోర్డు 20వ సమావేశాన్ని నిర్వహించారు. అడ్డమైన కొర్రీలు పెట్టి.. ఆ సమావేశానికి ఏపీ డుమ్మా కొట్టింది. తెలంగాణ తరఫున ఈఎన్సీ హాజరయ్యారు. 

తాజాగా నిర్వహించే మీటింగుకైనా ఏపీ వస్తుందా రాదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బోర్డు మీటింగ్​ఎజెండాలో భాగంగా మన రాష్ట్రం పోలవరం నల్లమలసాగర్​ లింక్​ అంశాన్ని చేర్చే అవకాశాలున్నాయి. బనకచర్ల లింక్​లో మార్పులు చేసి నల్లమలసాగర్​ లింక్​కు ఏపీ తెరలేపిన సంగతి తెలిసిందే. దీనిపై గట్టిగానే నిలదీసే అవకాశముంది.