కోల్బెల్ట్, వెలుగు: మంచిర్యాల జిల్లా మందమర్రి మున్సిపాలిటీలోని ఊరు మందమర్రి చెరువు మినీ ట్యాంక్బండ్అభివృద్ధికి మంత్రి వివేక్ వెంకటస్వామి రూ. కోటి నిధులను మంజూరు చేశారు. ఆదివారం మందమర్రి పాతబస్టాండ్ మినీ ట్యాంక్ బండ్ మార్నింగ్ వాక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బండి సదానందంయాదవ్ ఆధ్వర్యంలో మంత్రి వివేక్, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు.
సదానందం యాదవ్ మాట్లాడుతూ.. మంత్రి వివేక్ మార్నింగ్ వాక్లో భాగంగా ఊరు మందమర్రి చెరువు మినీ ట్యాంక్ బండ్ను సందర్శించారన్నారు. ఇక్కడ నెలకొన్న సమస్యలు, మహిళల ఇబ్బందులను మంత్రి దృష్టికి తీసుకవెళ్లినట్లు చెప్పారు. స్పందించిన మంత్రి ట్యాంక్ బండ్ అభివృద్ధికి కోటి రూపాయలు మంజూరు చేశారన్నారు.
చెన్నూరు నియోజకవర్గం,పెద్దపల్లి పార్లమెంట్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు మంత్రి, ఎంపీ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇరువురు నేతలకు వాకర్స్, స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.
