సాయిచంద్​ లేని లోటు కనిపిస్తున్నది : హరీశ్​రావు

సాయిచంద్​ లేని లోటు కనిపిస్తున్నది : హరీశ్​రావు
  •    అతడు తెలంగాణ ప్రజల గుండెల్లోనే ఉంటాడు: హరీశ్​రావు
  •     హస్తినాపురంలో ఉద్యమకారుడు సాయిచంద్ ప్రథమ వర్ధంతి
  •     హాజరైన కేటీఆర్​, ఉద్యమకారులు, కళాకారులు 

ఎల్బీనగర్, వెలుగు : బీఆర్ఎస్ సభలు, సమావేశాల్లో సాయిచంద్ లేని లోటు కనిపిస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్​రావు పేర్కొన్నారు. చిన్నవయస్సులోనే సాయి మనకు దూరం కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. హస్తినాపురంలోని జీఎస్ఆర్ కన్వెన్షన్​లో తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ -వర్ధంతి సభను శనివారం నిర్వహించారు. ఈ సభకు హరీశ్​రావుతోపాటు మాజీ మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్

ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ప్రజాకవి దేశపతి శ్రీనివాస్ తోపాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. సభలో సాయిచంద్ చిత్రపటానికి పూలమాల వేసి, -నివాళి అర్పించారు. అనంతరం సాయిచంద్ పాటల సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్​రావు మాట్లాడారు. సాయి మన మధ్యన లేకున్నా.. ఆయన పాట, ఆట చిరస్మరణీయని, అతడు తెలంగాణ ప్రజల గుండెల్లో  ఉంటాడని తెలిపారు.  

తన ఆట, పాటలతో సాయిచంద్​ తెలంగాణ ఉద్యమాన్ని కెరటంగా మలిచాడని కేటీఆర్​ కొనియాడారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు.