వాట్​ ఏ స్కీమ్, వాట్​ ఏ షేమ్​!

వాట్​ ఏ స్కీమ్, వాట్​ ఏ షేమ్​!
  • బీజేపీ ఏపీ చీఫ్​ సోము వీర్రాజు కామెంట్లు
  • కేటీఆర్ విమర్శలు

హైదరాబాద్​, వెలుగు: చీప్​ లిక్కర్​ ధరను రూ.50కి తగ్గిస్తామంటూ బీజేపీ ఏపీ చీఫ్​ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్​ విమర్శలు గుప్పించారు. బుధవారం ఆ కామెంట్ల వీడియోను ట్యాగ్​ చేస్తూ ఆయన ట్వీట్​ చేశారు. ‘‘రూ.50కే చీప్​ లిక్కర్​ ఇస్తరా? వాట్​ ఏ స్కీమ్​, వాట్​ ఏ షేమ్​. బీజేపీ ఏపీ నేతలు మరీ ఇంతగా దిగజారిపోతరా? ఇదేనా బీజేపీ జాతీయ విధానం? అధికారంలో లేని రాష్ట్రాలకే ఈ బంపర్​ ఆఫర్​ ఇస్తున్నరా?’’ అంటూ కేటీఆర్​ ప్రశ్నించారు. ఏపీలో నాణ్యమైన మద్యం అమ్మడం లేదని, కల్తీ మద్యాన్ని ఎక్కువ ధరకు అమ్ముతున్నారని విజయవాడలో నిర్వహించిన సభలో సోము వీర్రాజు కామెంట్​ చేశారు. బీజేపీని గెలిపిస్తే చీప్​ లిక్కర్​ ధరను రూ.75కి తగ్గిస్తామని, అవసరమైతే రూ.50కే అందిస్తామని ఆయన అన్నారు.