ప్రధాని మోడీని విమర్శించే స్థాయి కేటీఆర్ కి లేదు

ప్రధాని మోడీని విమర్శించే స్థాయి కేటీఆర్ కి లేదు

హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోడీని విమర్శించే స్థాయి కేటీఆర్ కి లేదన్నారు మాజీ మంత్రి డీకే అరుణ‌. క‌రోనా విష‌యంలో కేటీఆర్ సర్టిఫికెట్ ప్రధానికి అవ‌స‌రం లేదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తి జరిగిందన్నారు. కరోనా టెస్టులు పెంచాలని ప్రభుత్వానికి ముందు నుంచే బీజేపీ హెచ్చరించిందని, ICMR మార్గదర్శకాల ప్రకారమే రాష్ట్రంలో కరోనా పరీక్షలు చేయ‌డం లేదన్నారు.

వైరస్‌ కట్టడి చేయడంలో సర్కారు విఫ‌ల‌మైందని అన్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం క‌రోనా టెస్టులు నిర్వ‌హించ‌డంలో చిన్న రాష్ట్రాల కంటే వెన‌క‌బ‌డిందని, క‌రోనా విష‌యంలో ప్ర‌ధాని ముందుచూపు ఉంటే …కేసీఆర్ ది నిర్ల‌క్ష్యం ధోర‌ణి తో ఉన్నారన్నారు.