ఇండియాలో తాలిబన్​ తరహా ఘటనలా.. మోదీజీ మణిపుర్ ని కాపాడండీ..

ఇండియాలో తాలిబన్​ తరహా ఘటనలా.. మోదీజీ మణిపుర్ ని కాపాడండీ..

మణిపుర్​లో ఇద్దరు యువతులను నగ్నంగా ఊరేగించి సామూహిక అత్యచారానికి పాల్పడిన ఘటన తాలూకు దురాగతంపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీ రామారావు ట్విటర్​ వేదికగా స్పందించారు. ఆయన తన ట్వీట్​లో 'మోదీజీ.. అమిత్​షా జీ.. మీరు ఎక్కడున్నారు. మణిపుర్​లో తాలిబన్​తరహా ఘటన జరుగతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తోంది. తాలిబన్లు పిల్లలను, మహిళలను అగౌరవపరిస్తేనే.. ఇండియన్స్​ గా మనం వారిపై విరుచుకుపడుతున్నాం. అలాంటిది.. మణిపుర్​లో కుకీ తెగ మహిళల్ని మైతీలు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురి చేయడం బాధాకరం. 

అభివృద్ధి చెందుతున్న దేశంలో ఇలాంటి ఘటనలు జరగడం బాధాకరం. ఈ భయానక హింసాకాండ, శాంతి భద్రతలు దెబ్బ తిన్నా కేంద్రం మౌనంగా ఉంటోంది. మోదీగారు.. దయచేసి అన్నీ పక్కన పెట్టండి. మీ సమయాన్ని, శక్తిని ఆ రాష్ట్రాన్ని రక్షించడం కోసం ఉపయోగించండి.' అంటే కేటీఆర్​ ట్వీట్​ చేశారు. నేటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్​ వర్షాకాల సమావేశాల్లో మణిపుర్​ అంశాన్ని భారత్​ రాష్ట్ర సమితి పార్టీ లేవనెత్తుతుందని మంత్రి అన్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్​ చేశారు. ఆ రాష్ట్ర ప్రజలకు అన్ని పార్టీలు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.

జరిగిందిదే..

మణిపుర్​లో రెండు తెగల మధ్య రిజర్వేషన్​ సంబంధించి తీవ్రమైన గొడవలు జరుగుతున్నాయి.  రాజధాని ఇంఫాల్​కు 35 కి.మీ.ల దూరంలోని కాంగ్​పోప్కి జిల్లాలో  మే 4న చాలా మంది పురుషులు ఇద్దరు మహిళల్ని నగ్నంగా తీసుకెళ్తున్నారు. ఈ వీడియో తాజాగా సోషల్​ మీడియాలో కలకలం సృష్టిస్తోంది. వారంతా కలిసి మహిళల్ని సమీపంలోని పొలంలో బాధిత మహిళలపై అత్యాచారం చేశారని ఓ గిరిజన సంస్థ ఆరోపించింది. నిందితులపై నాంగ్​పాక్​ సెక్​మై పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయినట్లు పోలీసులు వెల్లడించారు. 

బీఆర్​ఎస్​ వాయిదా తీర్మానం..

మణిపుర్​ అల్లర్లపై చర్చించాలని పట్టుబడుతూ.. విపక్షాలు ఆందోళన చేస్తున్న వేళ.. లోక్​సభలో చర్చకు పట్టుబడుతూ బీఆర్​ఎస్​ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. ఇదే సమయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు రాజ్యసభ వాయిదా పడింది.