కేటీఆర్ ఫ్లాప్ షో..! వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌గా అన్ని ఎన్నికల్లోనూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ఓటమే

కేటీఆర్ ఫ్లాప్ షో..! వర్కింగ్ ప్రెసిడెంట్‌‌‌‌గా అన్ని ఎన్నికల్లోనూ బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ఓటమే

హైదరాబాద్​, వెలుగు: జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికలో అన్నీ తానై కేటీఆర్​ ప్రచారం చేసినా.. బీఆర్ఎస్​ పార్టీకి చేదు ఫలితమే ఎదురైంది. జూబ్లీహిల్స్​ ఉప ఎన్నికే కాదు..  అసెంబ్లీ ఎన్నికలప్పటి నుంచి వర్కింగ్​ ప్రెసిడెంట్‌‌‌‌గా కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు అన్నీ పరాజయాలే పలకరిస్తున్నాయి. పార్లమెంట్​ఎన్నికలు, ఉప ఎన్నికలు సహా ఏ ఎన్నికొచ్చినా కేటీఆర్​ ఫ్లాప్​ షో నడుస్తున్నదనే చర్చ ఇటు పార్టీవర్గాలతోపాటు అటు పొలిటికల్​ సర్కిల్స్‌‌‌‌లోనూ జరుగుతున్నది. అసలు సిట్టింగ్​ సీట్లనూ నిలబెట్టుకోలేకపోవడంతో.. లీడర్​గా కేటీఆర్​ విఫలమవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. లీడర్‌‌‌‌‌‌‌‌గా కేడర్‌‌‌‌‌‌‌‌ను ఏకతాటిపైన నిలబెట్టడంలో  ఫెయిల్​ అవుతున్నారన్న వాదనలూ వినిపిస్తున్నాయి. వరుస పరాజయాలతో శ్రేణుల్లోనూ నిరాశ నెలకొంటున్నది. 

రిటర్న్​ గిఫ్ట్​ ఇచ్చిన ప్రజలు..

జూబ్లీహిల్స్​ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి వేదికపైనా కాంగ్రెస్‌‌‌‌పై కేటీఆర్​ విమర్శనాస్త్రాలను సంధించారు. ఓ సినిమాలోని ‘కుర్చీ మడతపెట్టి’ అనే పాటనూ తన క్యాంపెయిన్‌‌‌‌లో వాడుకున్నారు.  కుర్చీ  మడతపెట్టి కొడితే కాంగ్రెస్​ ఖతమవ్వాలంటూ జూబ్లీహిల్స్​ ఓటర్లకు  పిలుపునిచ్చారు. కానీ, అది బూమరాంగ్​ అయ్యింది. నియోజకవర్గ ప్రజలు రిటర్న్​ గిఫ్ట్​ కింద.. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌నే కుర్చీ మడతెట్టి కొట్టారని పొలిటికల్​ సర్కిల్స్‌‌‌‌లో కామెంట్స్‌‌‌‌ వినిపిస్తున్నాయి. జూబ్లీహిల్స్​ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేటీఆర్​ వరుస రోడ్​షోలు చేసినా.. జనం ఆయన మాటలను పట్టించుకోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

ఏ ఎన్నికలోనూ గెలవలే..

అసెంబ్లీ ఎన్నికల తర్వాత  కేటీఆర్ ​ఆధ్వర్యంలోనే బీఆర్ఎస్​ పార్టీ పార్లమెంట్ ఎన్నికలకు వెళ్లింది.  కానీ, 17  సీట్లలో ఒక్కటంటే ఒక్క సీటును కూడా బీఆర్ఎస్​ గెలుచుకోలేకపోయింది. కొన్ని చోట్ల డిపాజిట్లే గల్లంతయ్యాయి. 2019 జనరల్ ​ఎలక్షన్లలో 9  సీట్లు గెలిచిన ఆ పార్టీ.. 2024 పార్లమెంట్​ ఎన్నికల్లో మాత్రం ఖాతానే తెరవకుండా జీరోతో సరిపెట్టుకున్నది. ఈ విషయంలో  నాయకుడిగా ఫెయిల్​ అయ్యారన్న అపవాదునూ కేటీఆర్‌‌‌‌‌‌‌‌ ఎదుర్కొన్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్​ పరిధిలోని సీట్లను  బీఆర్ఎస్​ ఎక్కువ సంఖ్యలో గెలుచుకున్నది. 17  సీట్లను సొంతం చేసుకున్నది. అయితే, 2024 మే 13న జరిగిన కంటోన్మెంట్ ఉప ఎన్నికలో..  కాంగ్రెస్​ అభ్యర్థి శ్రీ గణేష్‌‌‌‌పై  విజయం సాధించింది.