
కేయూ క్యాంపస్, వెలుగు: పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతిక్కరూ మొక్కలు నాటాలని కేయూ కో-ఎడ్యుకేషన్ ఇంజినీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ రమణ అన్నారు. ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై శుక్రవారం ప్రాజెక్టు వర్క్ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు లెక్చరర్లకు మొక్కలు అందించారు.
అనంతరం కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ రమణ మాట్లాడారు. కార్యక్రమంలో కాలేజీ సివిల్ ఇంజినీరింగ్ హెచ్వోడీ డాక్టర్ చాడా రాధికా రెడ్డి, సూపరిండెంట్ బొల్లెపాక ప్రభాకర్, డాక్టర్ సంగాల ఎఫ్రామ్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.