
కూకట్పల్లి, వెలుగు: కూకట్పల్లికి చెందిన 10 మంది డాక్టర్ల బృందం ఎవరెస్ట్డేను పురస్కరించుకుని ట్రెక్కింగ్చేస్తూ ఎవరెస్ట్బేస్ క్యాంప్చేరుకుంది. అక్కడ జాతీయ జెండాను ఎరవేసింది. వివేకానందనగర్కాలనీలో నివసించే వంశీరెడ్డితోపాటు మరో తొమ్మిది మంది డాక్టర్లు నేపాల్నుంచి ట్రెక్కింగ్చేస్తూ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకున్నారు.
ఈనెల 29న ఎవరెస్ట్డే కాగా, ఆరోజుకు నేల మట్టం నుంచి 5,364 మీటర్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి మొత్తం 5555 ఎత్తుకు వెళ్లి కాలాపత్తర్ని చేరుకున్నారు. ఎవరెస్ట్ఎక్కే బేస్క్యాంప్ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు. వారిలో డాక్టర్లు కేదార్ వంశీధర్, ప్రదీప్రెడ్డి, కమలాకర్, పవన్, రమేశ్, కృష్ణ, శివ, మల్లికార్జున్, సునీల్ఉన్నారు.