ఎవరెస్ట్​ ఎక్కిన కూకట్​పల్లి డాక్టర్లు..

ఎవరెస్ట్​ ఎక్కిన కూకట్​పల్లి డాక్టర్లు..

కూకట్​పల్లి, వెలుగు: కూకట్‌‌పల్లికి చెందిన 10 మంది డాక్టర్ల బృందం ఎవరెస్ట్​డేను పురస్కరించుకుని ట్రెక్కింగ్​చేస్తూ ఎవరెస్ట్​బేస్ క్యాంప్​చేరుకుంది. అక్కడ జాతీయ జెండాను ఎరవేసింది. వివేకానందనగర్​కాలనీలో నివసించే వంశీరెడ్డితోపాటు మరో తొమ్మిది మంది డాక్టర్లు నేపాల్​నుంచి ట్రెక్కింగ్​చేస్తూ ఎవరెస్ట్​ బేస్​ క్యాంప్ చేరుకున్నారు. 

ఈనెల 29న ఎవరెస్ట్​డే కాగా, ఆరోజుకు నేల మట్టం నుంచి 5,364 మీటర్లకు చేరుకున్నారు. అక్కడి నుంచి మొత్తం 5555 ఎత్తుకు వెళ్లి కాలాపత్తర్​ని చేరుకున్నారు. ఎవరెస్ట్​ఎక్కే బేస్​క్యాంప్​ వద్ద జాతీయ జెండాను ఎగురవేసి సంబురాలు చేసుకున్నారు. వారిలో డాక్టర్లు కేదార్​ వంశీధర్, ప్రదీప్​రెడ్డి, కమలాకర్, పవన్, రమేశ్, కృష్ణ, శివ, మల్లికార్జున్, సునీల్​ఉన్నారు.