కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య మరోసారి రోడ్డెక్కి నిరసన తెలిపారు. తన ఇంటి దగ్గర నుంచి టీడీపీ కార్యకర్తలతో ర్యాలీగా వచ్చిన అనంతయ్య… దున్నపోతుపై ఎక్కి కలెక్టరేట్ దగ్గర ప్రదక్షిణలు చేశారు. ఇసుక కొరత లేకుండా చూడాలంటూ ఆందోళన చేశాడు. వచ్చే నెల మొదటి వారం నుంచి ఇసుకను అందుబాటులో పెట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇసుక లేకపోవడంతో భవన నిర్మానాలు ఆగిపోయాయని, కార్మికులు పనులు లేక తెలంగాణ కు వలస పోతున్నారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సెప్టెంర్ 5 లోగా ఉచితంగా ఇసుకను అందించాలని కోరారు.
