లఖీంపూర్ ఖేరి ఘటనలో కాల్పులు జరిపిన మంత్రి కుమారుడు

లఖీంపూర్ ఖేరి ఘటనలో కాల్పులు జరిపిన మంత్రి కుమారుడు

లఖీంపూర్ ఖేరి ఘటనలో మరో కీలక విషయం బయటపడింది. అక్టోబర్ 3న రైతులపైకి మంత్రి కుమారుడి కాన్వాయ్ దూసుకెళ్లిన ఘటనలో నలుగురు రైతులు చనిపోవడం.. ఆ తర్వాత రైతులు కర్రలతో దాడి చేయడం వల్ల మరో నలుగురు మృతి చెందారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి అజయ్ మిశ్ర కుమారుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అంకిత్ దాస్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు.

అయితే, ఘటన సమయంలో ఆశిష్ మిశ్రా, ఆయన అనుచరులు కాల్పులు జరిపారని రైతులు ఆరోపించారు. ఈ క్రమంలో  ఆశిష్, అంకిత్ ల లైసెన్స్డ్ గన్స్ లను  అక్టోబర్ 15న ఫోరెన్సిక్ లేబొరేటరీకి పంపించారు. వాటిని పరీక్షించిన ఫోరెన్సిక్ లేబొరేటరీ.. ఆ తుపాకుల నుంచి కాల్పులు జరిగినట్టు కన్ఫాం చేసింది. కాగా, లఖీంపూర్ కేసుకు సంబంధించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది.