లక్షలు ఖర్చుపెట్టి మొక్కలు నాటిన్రు..ఎండిపోతుంటే పట్టించుకుంటలే

లక్షలు ఖర్చుపెట్టి మొక్కలు నాటిన్రు..ఎండిపోతుంటే పట్టించుకుంటలే

కామారెడ్డి, వెలుగు: ఊళ్లలో నాటిన మొక్కలు ఎండిపోతే  కింది స్థాయి ఉద్యోగులకు మెమోలు ఇవ్వడం, సస్పెండ్ చేసే ఉన్నతాధికారులు తమ ఆఫీసులోనే లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి నాటిన మొక్కలు, గడ్డి ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదు. అందుకు నిదర్శనమే ఈ ఫొటోలు..

కామారెడ్డి కలెక్టరేట్ ఆవరణ, ముందు భాగం ఆహ్లాదకరంగా ఉండేందుకు రూ.లక్షలు వెచ్చించి పూల మొక్కలు, గడ్డి నాటారు. మెయింటనెన్స్ లేకపోవడంతో అవి ఎండిపోయి పచ్చదనం కరువైంది. మొక్కల సంరక్షణ విషయంలో యంత్రాంగం పట్టించుకోకపోవడంపై విమర్శలకు దారితీస్తోంది.