
- తొలిసారి విజయవంతంగా నిర్వహించిన మన ఎయిర్ ఫోర్స్
న్యూఢిల్లీ: ఇండియన్ ఎయిర్ఫోర్స్ (ఐఏఎఫ్) మరో అరుదైన ఘనత సాధించింది. తొలిసారి నైట్విజన్ గాగుల్స్ (ఎన్వీజీ) సాయంతో విమానాన్ని సక్సెస్ఫుల్గా ల్యాండ్ చేసింది. ఈస్టర్న్ సెక్టార్లోని అడ్వాన్స్డ్ ల్యాండింగ్ గ్రౌండ్లో నైట్ విజన్లో ఐఏఎఫ్ సీ-130జే విమానాన్ని విజయవంతంగా ల్యాండ్ చేసినట్టు అధికారులు ట్విట్టర్ (ఎక్స్)లో వెల్లడించారు. ఇందుకు సంబంధించిన రెండు వీడియోలను ఐఏఎఫ్ పోస్ట్ చేసింది. మొదటి వీడియోలో ఎన్వీజీ టెక్నాలజీతో ఎయిర్క్రాఫ్ట్ స్మూత్ ల్యాండింగ్అయినట్టు కనిపించింది.
రెండో క్లిప్లో విమానం కిటికీ లోపలి దృశ్యాలను చూపించింది. ఈ రెండు క్లిప్లు నైట్ విజన్ కు సంబంధించినవి అయినందున గ్రీన్ కలర్లో ఉన్నాయి. ‘‘ఎన్వీజీ సాంకేతికతను ఉపయోగించి ఇప్పుడు ఐఏఎఫ్ తక్కువ కాంతి పరిస్థితుల్లో సురక్షితమైన, మరింత ప్రభావవంతమైన కార్యకలాపాలను నిర్వహించగలదు. ఇది రాత్రిపూట మిషన్లను సమర్థవంతంగా నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది”అని ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ప్రారంభంలో కార్గిల్ ఎయిర్స్ట్రిప్లో ఇదే విమానం(సీ130జే)ను ఐఏఎఫ్ సేఫ్ ల్యాండింగ్ చేసింది.