కిన్నౌర్: కొండ అంచులపై ఉన్న జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక బస్సుతో పాటు మరికొన్ని వాహనాలపై ఉన్నట్టుండి కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సమయంలో బస్సుతో పాటు మిగతా వాహనాల్లోనూ జనాలు ఉన్నారు. ఈ ప్రమాదంలో సుమారు 40 మందికి పైగా ఆ కొండ చరియల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. హిమాచల్ప్రదేశ్లోని కిన్నౌర్ జిల్లా చౌరా ప్రాంతంలో ఉన్న నేషనల్ హైవే 5పై బుధవారం ఉదయం 11.56 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. కిన్నౌర్ నుంచి హరిద్వార్కు వెళ్తున్న హిమాచల్ ప్రదేశ్ ఆర్టీసీ బస్సు ఈ ప్రమాదంలో చిక్కుకుంది. ఆ సమయంలో బస్సులో నిండుగా జనాలు ఉన్నారని అధికారులు చెబుతున్నారు. బస్సుతో పాటు కారు, ట్రక్కు కూడా కొండచరియల కింద చిక్కుకున్నాయని తెలిపారు. ఈ ఘటన గురించి తెలియగానే ఆర్మీ, ఐటీబీపీ బలగాలు, నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీమ్లను రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాల్సిందిగా కోరామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ చెప్పారు. ఆ తర్వాత వేగంగా పోలీసులతో పాటు రెస్క్యూ టీమ్లు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. కొండ చరియల కింద చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఆపరేషన్ షురూ చేశారు. ఇప్పటికే బస్సు డ్రైవర్ను కాపాడామని కిన్నౌర్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. భారీ వర్షాల కారణంగా కొద్ది రోజులుగా హిమాచల్ప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో తరచూ కొండ చరియలు విరిగిపడుతున్నాయి.
బస్సుపై విరిగిపడ్డ కొండచరియలు: 40 మందికిపైగా ప్రయాణికులు
- దేశం
- August 11, 2021
లేటెస్ట్
- GT vs RCB: కోహ్లీ, డుప్లెసిస్ బాదుడే బాదుడు.. బెంగుళూరు చేతిలో చిత్తయిన గుజరాత్
- ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కాన్వాయ్పై ఉగ్రదాడి
- మీటింగ్లోనే కాంగ్రెస్ కార్యకర్తని వెంటాడి చంపిండు
- బతికేది ఎట్టా: 4 నెలలు.. 279 కంపెనీలు.. 80వేల మంది ఐటీ ఉద్యోగులను తీసేశాయ్
- Health Alert : ఈ కాలంలో ప్రతి ఇంట్లో ఉండాల్సిన మెడికల్ కిట్ ఇదే..
- కేసీఆర్ 20 వేల ఎకరాలు దండుకుండు: వివేక్ వెంకటస్వామి
- జగన్ మెడకు ఉరేసే అవకాశం వచ్చింది.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..
- దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత నాది : సీఎం రేవంత్ రెడ్డి
- GT vs RCB: మెరిసిన బెంగళూరు బౌలర్లు.. స్వల్ప స్కోరుకే గుజరాత్ ఆలౌట్
- సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్ తనిఖీ
Most Read News
- మే 5 నుంచి భారీ వర్షాలు పడే చాన్స్
- GT vs RCB: గుజరాత్తో కీలక మ్యాచ్.. టాస్ గెలిచిన బెంగళూరు
- రోడ్లు ఇక వాటికవే రిపేర్లు చేస్కుంటయ్ .. కొత్త టెక్నాలజీపై ఎన్హెచ్ఏఐ ఫోకస్
- ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ కుమార్తె ఎన్నికల ప్రచారం
- AI టెక్నాలజీ CCTV నిఘాలో నీట్ ఎగ్జామ్స్
- నగలు తాకట్టు పెట్టి డబ్బు తెస్తుండగా.. పోలీసులు సీజ్
- బాబోయ్ ఎండలు : ఏంది సామీ ఇది.. తట్టుకోలేకపోతున్నాం..
- విహారయాత్రలో విషాదం.. కారు లోయలో పడి ఐదుగురు విద్యార్థులు మృతి
- పాత కారును వదిలేసుకుంటే .. కొత్తదానిపై రాయితీ
- యూట్యూబ్ ఛానెల్ లైక్ చేయమన్నారు..ఖాతానుంచి రూ. 2.7 కోట్లు కొట్టేశారు