ఆటోపై లారీ బోల్తా…ఒకరు మృతి

ఆటోపై లారీ బోల్తా…ఒకరు మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం-రాజుపేట మేడువాయి మధ్యగల కల్వర్టు దగ్గర ఈ ఘటన జరిగింది. ఇవాళ(శనివారం) తెల్లవారుజామున 2.30 సమయంలో మిర్చిలోడుతో వెళ్తున్న లారీ ఆటోపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఒకరు మృతి చెందగా, నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్ఐ సంతోష్ గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆటో బూర్గంపహడ్ కి సంబందించిందిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.