న్యూఢిల్లీ: ఢిల్లీ తీస్ హజారీ కోర్టు కాం ప్లెక్స్లో లాయర్ల మధ్య జరిగిన వాగ్వా దం కాల్పులకు దారితీసింది. బుధవా రం లాయర్ల గ్రూప్ల మధ్య వివాదం రేగింది. ఇరువర్గాలు రాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో న్యాయవాది ఒకరు గాల్లోకి తుపాకీతో కాల్పులు జరిపాడు. సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. లాయర్ల వివాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకు ని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. కాగా, కోర్టు కాంప్లెక్స్లో లాయర్లు వివాదాస్పదంగా ప్రవర్తించడాన్ని బార్ కౌన్సిల్ చైర్మన్ కేకే మనన్ ఖండించారు. లాయర్ కాల్పులు జరిపిన తుపాకీకి లైసెన్స్ఉందా లేదా విచారిస్తున్నామని, లైసెన్స్ ఉన్నా సరే కోర్టు పరిసరాల్లో ఆయుధాలను ఉపయోగించకూడదని చెప్పారు.