ఢిల్లీ కోర్టులో లాయర్ కాల్పులు

ఢిల్లీ కోర్టులో లాయర్ కాల్పులు

న్యూఢిల్లీ: ఢిల్లీ తీస్​ హజారీ కోర్టు కాం ప్లెక్స్​లో లాయర్ల మధ్య జరిగిన వాగ్వా దం కాల్పులకు దారితీసింది.  బుధవా రం లాయర్ల  గ్రూప్​ల మధ్య వివాదం రేగింది. ఇరువర్గాలు రాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో న్యాయవాది ఒకరు గాల్లోకి తుపాకీతో కాల్పులు జరిపాడు. సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.  లాయర్ల వివాదంపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకు ని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. 

ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని పోలీసులు తెలిపారు. కాగా, కోర్టు కాంప్లెక్స్​లో లాయర్లు వివాదాస్పదంగా ప్రవర్తించడాన్ని బార్ ​కౌన్సిల్​ చైర్మన్ ​కేకే మనన్ ​ఖండించారు. లాయర్ కాల్పులు జరిపిన తుపాకీకి  లైసెన్స్​ఉందా లేదా విచారిస్తున్నామని, లైసెన్స్ ఉన్నా సరే కోర్టు పరిసరాల్లో ఆయుధాలను ఉపయోగించకూడదని చెప్పారు.