విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టులో పిల్

విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టులో పిల్

రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టులో పిల్ దాఖలైంది. రాష్ట్రంలో ప్రతి సంవత్సంర టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని న్యాయవాది శంకర్ పిల్ దాఖలు చేశారు. ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పిల్ దాఖలు చేశారు. ప్రతి ఎగ్జామ్ హాల్ టికెట్స్ మీద హెల్ప్ లైన్ సెంటర్ నెంబర్ ఇవ్వాలని శంకర్ కోరారు.

10వ తరగతి టెస్ట్ బుక్ లో దీనికి సంబంధించిన ఒక సిలబస్ పెట్టాలని పిటిషనర్ తరపు న్యాయవాది ప్రవీణ్ కుమార్ కోర్టును కోరారు. గతంలో ప్రభుత్వం రోషిని అనే కార్యక్రమం పెట్టినా ఎలాంటి ఉపయోగం లేదని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

న్యాయవాది శంకర్ దాఖలు చేసిన పిల్ ను విచారించిన హైకోర్టు.. ప్రతివాధులకు నోటీసులు జారీ చేసింది. తెలంగాణ ఉన్నత విద్యా మండలి ప్రధాన కార్యదర్శికి, స్కూల్ సెకండరీ బోర్డు కమిషనర్, ఇంటర్ బోర్డు కమిషనర్ కు నోటీసులు పంపింది.15 సంవత్సరాల నుంచి ఎంత మంది విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నారో పూర్తి వివరాలు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా వేసినట్లు హైకోర్టు తెలిపింది.