జులై 29న లక్ష్మీ ఫైనాన్స్ ఐపీఓ

జులై 29న లక్ష్మీ  ఫైనాన్స్ ఐపీఓ

న్యూఢిల్లీ: ఎన్​బీఎఫ్​సీ కంపెనీ లక్ష్మీ ఇండియా ఫైనాన్స్ లిమిటెడ్  తన రూ. 254-కోట్ల ఇనీషియల్​ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ) కోసం ఒక్కో షేరుకు రూ. 150-–158 ధరను నిర్ణయించింది. ఇష్యూ ఈ నెల 29న పబ్లిక్ సబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్క్రిప్షన్ కోసం ప్రారంభమై 31న ముగుస్తుందని కంపెనీ ప్రకటించింది. జైపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఈ కంపెనీ ఐపీఓలో 1.84 కోట్ల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, 56.38 లక్షల షేర్ల ఆఫర్​ఫర్​సేల్​(ఓఎఫ్ఎస్​) ఉంటాయి. 

తాజా ఇష్యూ నుంచి వచ్చే ఆదాయాన్ని లోన్ల చెల్లింపునకు, సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం, భవిష్యత్తు మూలధన అవసరాలను తీర్చడానికి ఉపయోగిస్తారు. లక్ష్మీ ఇండియా ఫైనాన్స్, డిపాజిట్ -టేకింగ్, ఎంఎస్​ఎంఈ, వెహికల్​, కన్​స్ట్రక్షన్​సహా పలు రకాల లోన్లను ఇస్తుంది.