- కత్తులతో అటాక్ చేసిన ముగ్గురు మైనర్లు
- బాధితుడి పరిస్థితి విషమం
ఎల్బీనగర్, వెలుగు: మొబైల్ అమ్మిన డబ్బుల విషయంలో గొడవ జరగ్గా.. ఓ మైనర్ పై మరో ముగ్గురు మైనర్లు కత్తులతో దాడి చేశారు. బాలాపూర్ ఎర్రకొంట వద్ద ఆదివారం రాత్రి నలుగురు స్నేహితులు మద్యం సేవించారు. ఇందులో ఒక మైనర్ వద్ద మరో మైనర్ మొబైల్ తీసుకొని అమ్మిపెడుతానని చెప్పాడు. మొబైల్ అమ్మేసి డబ్బులు ఇవ్వకుండా మొబైల్ ఇచ్చిన మైనర్ పైనే స్నేహితుల మధ్య దుష్ప్రచారం చేస్తున్నాడు. అది మనసులో పెట్టుకున్న మైనర్.. మొబైల్ అమ్మిన మైనర్ను హత్య చేయాలని అనుకున్నాడు.
తన ఇద్దరు స్నేహితులతో కలిసి సోమవారం లిక్కర్ తాగాడు. ఇద్దరిని వెంట పెట్టుకుని మొబైల్ అమ్మిన బాలుడి వద్దకు వెళ్లాడు. తన వెంట తెచ్చుకున్న కత్తితో దాడి చేశాడు. స్థానికులు రావడంతో నిందితులు పారిపోయారు. బాధితుడిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
