రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద బీజేపీ శ్రేణులు నిరసన తెలియజేస్తున్నాయి. తిరుపతి ఆర్డీవో కార్యాలయ అధికారులకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు తదితర నాయకులు వినతి పత్రం ఇచ్చారు. రాష్ట్రంలో ఉన్న ఇసుకను 760 కోట్ల టెండర్ విధానం ద్వారా ఇవ్వడం జరిగింది. బంగారం కంటే ఇసుక ధరే ఎక్కువయ్యే పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. సామాన్య ప్రజలు ఇసుకని బ్లాక్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని వల్ల 50 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి ఉంది. ఇసుక విధానంలో సరైన అవగాహన రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడంతో అనేక అక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలించేందుకు కొంతమంది ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈ టెండర్ విధానాన్ని ఏర్పాటుచేశారు. టెండరు విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. ఉచితంగా ఇసుకను ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధికంగా ఇసుక లభిస్తోంది. ప్రభుత్వ అండతో రాబందులు ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నాయి. ఎన్నికల కోడ్ ఉన్నందున నిరసన తెలియచేయకూడదంటూ పోలీసులు బీజేపీ నేతలకు నోటీసులు జారీ చేశారు.
లీడర్లు ఇసుకను పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నారు
- ఆంధ్రప్రదేశ్
- March 23, 2021
లేటెస్ట్
- చెలరేగిన కేఎల్ రాహుల్, డికాక్..CSK పై LSG విక్టరీ
- రంగారెడ్డి జిల్లాలో పిడుగుపాటుకు రైతు మృతి
- లోక్ సభ ఎన్నికలు... దీర్ఘకాలిక సెలవులు రద్దు
- కరీంనగర్లో రూ.7లక్షల నగదు పట్టివేత
- తొందర్లోనే బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది : వివేక్ వెంకటస్వామి
- నిమ్మ చెట్టుకు ఎరువులు ఇవే... ఎలా వాడాలంటే..
- తెలంగాణలో ఆ పార్టీలకు చాలాచోట్ల డిపాజిట్లు గల్లంతు: బండి సంజయ్
- CSK vs LSG : బ్యాట్ ఝళిపించిన జడేజా, ధోనీ.. చెన్నై భారీ స్కోర్
- ఎండకు ముఖం నల్లగా మారిందా.. ఇలా చేస్తే అందంగా తయారవుతుంది..
- జగన్ ప్రచారాన్ని రాజస్థాన్ లో కూడా వాడుకుంటున్నారు..ఏమైందంటే..
Most Read News
- Summer Tour : తెలంగాణ ఊటీ.. మెదక్ గొట్టంగూడ.. ఫ్యామిలీతో మస్త్ ఎంజాయ్ చేయొచ్చు
- దుబాయ్లో ఆకుపచ్చగా ఆకాశం
- వెడ్డింగ్ కార్డ్లో తెలంగాణ యాస..పెళ్లి పిలుపులో నయా ట్రెండ్
- ఏప్రిల్23 హనుమత్జయంతి..ఆ రోజు ఏ రాశివారు ఏం చేయాలంటే....
- ఆధార్ అప్డేట్కు ఎంత చెల్లించాలి.. కొత్త రేట్లు ఇవే..
- కామారెడ్డి జిల్లా జడ్పీ హైస్కూల్లో...టీచర్ సస్పెన్షన్
- హనుమత్ జయంతి 2024: ఆంజనేయుని జన్మ రహస్యం ఇదే..
- డ్యూటీలో నిర్లక్ష్యం.. ఆరుగురు పోలీసు అధికారుల సస్పెన్షన్
- చిలుకూరులో సంతాన ప్రసాదం : పోటెత్తిన భక్తులు, ట్రాఫిక్ జాం
- లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం.. అప్రూవర్గా మారిన శరత్ చంద్రారెడ్డి