
హైదరాబాద్, వెలుగు: బిజినెస్ లీడర్లు, స్టార్టప్లు, ఎంటర్ప్రెనూర్లతో కూడిన నెట్వర్క్ లీడర్స్ ఫర్ ఇండియా ఆర్గనైజేషన్ (లియో) తమ మొబైల్ యాప్ను మంగళవారం లాంచ్ చేసింది. ప్రస్తుతం తమ సభ్యుల సంఖ్య 104 కి చేరిందని ఈ ఆర్గనైజేషన్ ఫౌండర్ మోహ్నిష్ యెర్రా పేర్కొన్నారు. లియో మెంబర్లు ఇప్పటికే 16 బిజినెస్లలో రూ.20 కోట్లు ఇన్వెస్ట్ చేశారని చెప్పారు. మైక్యాప్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా పర్సనల్గా 18 స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టానని ఆయన వివరించారు.
హైదరాబాద్లో రూ.9.8 కోట్లకు ల్యాండ్ కొన్నామని, దీనిని విల్లా ప్లాట్స్గా డెవలప్ చేసి అమ్ముతామని మోహ్నిష్ పేర్కొన్నారు. లియో వెల్త్మేనేజ్మెంట్ సెగ్మెంట్ ద్వారా మరో రూ.9.05 కోట్ల అసెట్స్ను మేనేజ్ చేస్తోందన్నారు. లియో ఆర్గనైజేషన్లో ఏడాదికి రూ. 30 వేలు కట్టి జాయిన్ అవ్వొచ్చని, మెంబర్షిప్ 10 ఏళ్లు ఉంటుందని వివరించారు. ఈ పదేళ్లకు గాను ఎంట్రీ ఫీజు అడ్వాన్స్గా చెల్లించాలన్నారు.