భూమికి మూరెడు లేనొళ్లు కేసీఆర్ ను తిడ్తరా ? : శంకర్ నాయక్

భూమికి మూరెడు లేనొళ్లు కేసీఆర్ ను తిడ్తరా ? : శంకర్ నాయక్

యాత్రల పేరుతో వచ్చే ప్రతి నాయకుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని  మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు ఏమి చేస్తారో చెప్పండంటూ సవాల్ విసిరారు. భూమికి మూరెడు లేని వారు కూడా సీఎం కేసీఆర్ కుటుంబంపై ఇష్టమున్నట్లు మాట్లాడుతున్నారని శంకర్ నాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలసవాదులు తమ అవసరాల కోసం తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. పర్యటనలు చేసుకోండి కానీ మాట్లాడే భాష, నోరును అదుపులో పెట్టుకోండి.. లేదంటే మానుకోట కంకర రాళ్ళకు మరొకసారి పని కల్పించాల్సి వస్తుందంటూ హెచ్చరించారు. కనుసైగ చేస్తే చాలు తమ పార్టీ కార్యకర్తలు వారిని తరిమి తరిమి కొడతారని శంకర్ నాయక్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.